Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కరోనా కొత్త వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదు: భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ

  • ఈ వేరియంట్ మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో సోకుతోందని వెల్లడి
  • ఇది అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోందన్న వైద్య బృందం
  • వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు గల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

కరోనా మహమ్మారిపై భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ స్పందించింది. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం వ్యాపిస్తోన్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంటేనని తెలిపింది. మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో గత రెండు నెలలుగా ఈ వేరియంట్ సోకుతోందని స్పష్టం చేశారు. ఇది అంత ప్రమాదకరం కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక విడుదల చేసిందని పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశముందని వైద్య బృందం పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు గల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Related posts

తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేస్తా… ఈ బంధం కొనసాగాలి: రామ్మోహన్ నాయుడు

Ram Narayana

కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్దమని సుప్రీంకోర్టు చెప్పింది… సీఎంగా కొనసాగే హక్కు లేదు: బీజేపీ

Ram Narayana

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన…

Ram Narayana

Leave a Comment