ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

విజయవాడ నుంచి పోటీచేస్తే గెలుపు నాదే…బీజేపీ నేత సుజనాచౌదరి …

విజయవాడ నుంచి పోటీ చేస్తే నా గెలుపు ఖాయం: సుజనా చౌదరి

  • అధిష్ఠానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానన్న సుజనా చౌదరి
  • పొత్తులపై హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
  • అమరావతికి బీజేపీ అనుకూలంగా ఉందన్న సుజనా చౌదరి

బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి తనను ఎన్నికల బరిలోకి దింపితే తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పొత్తులపై తమ అధిష్ఠానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని అన్నారు. అమరావతికి బీజేపీ హైకమాండ్ అనుకూలంగా ఉందని చెప్పారు. 

ఏపీలో ఈసారి ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని సుజనా చౌదరి అన్నారు. బీజేపీ చేసిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాలంటీర్లను ఎన్నికల కమిషన్ దూరంగా ఉంచడం మంచి పరిణామమని అన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Related posts

రేపు పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్న జగన్!

Ram Narayana

జగన్ 30 ఏళ్లు పాలించడం కాదు… జీవితాంతం జైల్లో ఉండాల్సిందే: యనమల…

Ram Narayana

వైసీపీ కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌: జగన్

Ram Narayana