తెలంగాణ వార్తలు

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
  • ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడి
  • బి.జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ లోగా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇటీవలి వరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.  

Related posts

దావోస్‌లో రేవంత్ రెడ్డితో చిరంజీవి…

Ram Narayana

హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి!

Ram Narayana

గత పాలకులు పాలమూరును నిర్లక్ష్యం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన!

Ram Narayana