Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
  • ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడి
  • బి.జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్

టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ లోగా వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇటీవలి వరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.  

Related posts

పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు!

Ram Narayana

వారం రోజుల్లో పెళ్లి.. నిద్రలోనే మృతి చెందిన యువకుడు…

Ram Narayana

6,304 ప్రత్యేక బస్సులు ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ!

Ram Narayana

Leave a Comment