Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్ పై లోక్‌సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు…

ఏపీ సీఎం జగన్ పై లోక్‌సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు
-ఓం బిర్లాను కలిసిన తన అరెస్ట్ అక్రమం మంటు నివేదన

-దోషులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
-జగన్ బెయిలు రద్దు చేయమన్నందుకు నాపై కక్ష కట్టారు
-ఐదుగురు ముసుగు వ్యక్తులు కస్టడీలో నన్ను తీవ్రంగా కొట్టారు
-నా అరెస్టుకు ముందు మీకు సమాచారం ఇవ్వలేదు
-దోషులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ
పట్టు వదలని విక్రమార్కుడిలా నరసాపురం ఎంపీ రఘురామకృషంరాజు ఢిల్లీలోనూ ప్రతి ఒక్కరిని కలిసి తనను అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు.అంతే కాకుండా కేవలం జగన్ బెయిల్ రద్దు చేయమన్నందుకే తనపై దేశద్రోహం కేసు పెట్టి ఎ సి బి వారితో కేసు పెట్టించి అరెస్ట్ చేసి దాడి చేయించారని ,ఎ సి బి కస్టడీలో తనపై ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు వచ్చి విఫరీతంగా కొట్టారని తనకు న్యాయం చేయాలనీ దోషులపై కఠిన చర్యలు తీసుకునేలా సహకరించాలని లోకసభ స్పీఎకర్ ఓంబిర్లాను కలిసి కోరారు …..
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత రాత్రి 9.20 గంటల సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలను కలిసి అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అరెస్టుకు దారితీసిన అంశాలను వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తన కేసులో ముఖ్యమంత్రి జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్‌పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని స్పీకర్‌కు తెలిపారు. తాను సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని, తన అరెస్టుకు ముందు స్పీకర్‌గా మీకు సమాచారం కూడా ఇవ్వలేదని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

తనను అక్రమంగా అరెస్ట్ చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అయిన గాయాలపై గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన అసత్యాల నివేదికపై హైకోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు, సీఐడీ కోర్టు బేఖాతరు చేశాయన్నారు. వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ అయినట్టు గుర్తు చేశారు. రఘురామ కృష్ణరాజు చెప్పినవన్నీ విన్న స్పీకర్ ఓం బిర్లా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Related posts

షర్మిల బీజేపీ వదిలిన బాణమే…తమ్మినేని…

Drukpadam

రాహుల్ రైలు ప్రయాణం …ఢిల్లీ టు ఉదయ్ పూర్!

Drukpadam

సజ్జల సహా పలువురు సలహాదారుల పదవీ కాలం పొడిగింపు..!

Drukpadam

Leave a Comment