Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ సీటు పంచాయతీ …

ఖమ్మం లోక్ సభ సీటుపై కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ నడుస్తుంది …దీంతో గట్టి పోటీ కనిపిస్తోంది. పలువురు పోటీకి సై అంటున్నారు. తాజాగా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. తనకే హక్కు ఉందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు.

మల్లు భట్టి భార్య నందిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తానంటూ ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమేనని.. అది ప్రజల నుంచి వచ్చిన ప్రచారమని… దానిని ఎవరూ ఆపలేరన్నారు. ప్రజలు తనను ఖమ్మం ఎంపీ కావాలని కోరుకుంటున్నారని… పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. అదే విధంగా వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ , రెవిన్యూ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ,వ్యాపారవేత్త వంకాయలపాటి రాజా కూడా టికెట్ ఆశీస్తున్న వారి జాబితాలో ఉన్నారు …

ఈ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి స్పందించారు. ఖమ్మం నుంచి లోక్ సభకు పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లు చెప్పేవి అన్నీ కథలేనని.. అవేవీ నమ్మవద్దన్నారు. రేణుకా చౌదరి కోరుకున్నదంటే కాదనే శక్తి ఎవరికీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

Related posts

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

Ram Narayana

ఇంతకూ పొంగులేటి పోటీ శాసనసభాకా …? పార్లమెంట్ కా …??

Ram Narayana

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్… డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు బీఆర్ యస్ కు బై… కాంగ్రెస్ కు జై ..

Ram Narayana

Leave a Comment