Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అయోధ్య వార్తలు

అయోధ్య బాల రాముడి పేరు మార్పు.. ఇకపై ఈ పేరుతో పిలుస్తారు!

  • రామ్ లల్లా పేరు బాలక్ రామ్ గా మార్పు
  • ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామన్న ట్రస్ట్ పూజారి
  • గర్భగుడిలో కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్లని వెల్లడి

అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో నిన్న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. 

ఇకపై రామ్ లల్లాను ‘బాలక్ రామ్’గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని… అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు. 

మరోవైపు, స్వామికి రోజుకు ఆరుసార్లు హారతిని ఇస్తామని ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని తెలిపారు. మంగళ, శ్రింగార, భోగ, ఉతపన్, సంధ్యా, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండ్లు, రబ్ డీ ఖీర్, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. 

ఈరోజు నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో, ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది.

అయోధ్య బాలరాముడి విగ్రహం ‘కృష్ణ శిల’ వయస్సు 250 కోట్ల సంవత్సరాలు.. వివరాలు ఇవిగో

  • నల్ల రాయి వయస్సు 2.5 బిలియన్ సంవత్సరాలు
  • భూమి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలుగా ఉంటుందని అంచనా
  • మైసూర్ జిల్లా జయపుర హోబ్లీ గ్రామం నుంచి వచ్చిన నల్లరాయి
Ram Lalla Idol At Ayodhya Carved Out Of 2 Billion Year Old Black Granite

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం నాడు వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ తర్వాత రామ్ లల్లా దివ్యరూపాన్ని చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. నల్లరాతితో లేదా కృష్ణ శిలతో చెక్కిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ కృష్ణ శిలకు చరిత్ర ఉంది. ఈ ప్రత్యేక కృష్ణశిలను కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించారు. ఈ రాయి 2.5 బిలియన్ (250 కోట్ల) సంవత్సరాల క్రితం నాటిదని పరీక్షలలో తేలిందని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేశ్ తెలిపారు. భారతీయ ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించడానికి ఏర్పడిన నోడల్ ఏజెన్సీయే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్.

బాలరాముడి విగ్రహం కోసం వినియోగించిన రాయి చాలా మన్నికైనదని వెంకటేశ్ తెలిపారు. ఈ ఉప ఉష్ణ మండలంలో వాతావరణ వైవిధ్య నిరోధకతను కలిగి ఉన్న పురాతనమైన రాయి అని తెలిపారు.  

జయపుర హోబ్లీ గ్రామం నుంచి వచ్చిన రాయి

నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన మైసూర్ జిల్లాలోని జయపుర హోబ్లీ గ్రామం నుంచి ఈ రాయిని తీసుకు వచ్చారు. ఈ శిల కేంబ్రియన్ పూర్వ యుగానికి చెందినదిగా గుర్తించారు. భూమి దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిందని అంచనా. ఇప్పుడు రామ్ లల్లా విగ్రహం కోసం ఉపయోగించిన నల్ల గ్రానైట్ రాయి భూమి వయస్సులో దాదాపు సగం లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వయస్సే ఉంటుందని అంచనా. అంటే, ఈ కృష్ణ శిల వయస్సు దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాలు.  

విగ్రహం చెక్కడానికి ఆరు నెలల సమయం

రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగి రాజ్ చెక్కారు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి ఆయనకు ఆరు నెలల సమయం పట్టింది. ఆయన చెక్కిన మరో ప్రసిద్ధ కళాఖండాలలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న 30 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఒకటి.

Related posts

అయోధ్య వేడుకలకు అద్వానీ దూరం.. ఎందుకంటే..!

Ram Narayana

అయోధ్య రామాలయానికి రూ. 2.66 కోట్ల విరాళం ఇచ్చిన హనుమాన్ సినిమా టీం

Ram Narayana

ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదు: ప్రధాని మోదీ

Ram Narayana

Leave a Comment