Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బేగంపేట విమానాశ్రయంలో ఖర్గేకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం

  • ఎల్బీ స్టేడియంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం
  • సమావేశానికి హాజరవుతున్న మల్లికార్జున ఖర్గే
  • సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షీ, మల్లు భట్టి తదితరులు

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఖర్గే నగరానికి వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్‌కు ఖర్గే దిశా నిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.

 

Related posts

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …

Ram Narayana

పార్టీ మార్పు ప్రచారం… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Ram Narayana

టికెట్స్ కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి …కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Ram Narayana

Leave a Comment