Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ మాజీ మేయర్‌పై కాల్పులు…

  • నాసిక్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో ఘటన
  • ఓల్డ్ ఆగ్రా రోడ్డులో ఓ షాపు వద్ద ఉన్న అబ్దుల్ మాలిక్‌పై గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు 
  • బాధితుడికి ఛాతి, కాలికి గాయాలు, ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
  • నిందితులపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు

మహారాష్ట్రలో ఎమ్ఐఎమ్ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాలిక్ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. నాశిక్ జిల్లా లో ఓల్డ్ ఆగ్రా రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌కు సమీపంలోగల షాపు వద్ద మాజీ మేయర్ కూర్చుని ఉండగా ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 1.20 గంటలకు  బైక్ పై వచ్చిన నిందితులు మాజీ మేయర్ పై మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. మాలిక్ ఛాతి, కాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని నిందితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

కేరళలో పేలుళ్లు… సీఎం విజయన్ తో మాట్లాడిన అమిత్ షా

Ram Narayana

సూర్యాపేటలో దారుణం.. కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం!

Drukpadam

భారత కంపెనీ దగ్గు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి!

Drukpadam

Leave a Comment