Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జై షా

  • టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
  • టీమిండియాపై అభినందనల వెల్లువ
  • టీమిండియా బృందానికి తియ్యని కబురు చెప్పిన జై షా

ఐసీసీ టైటిళ్ల కరవు తీర్చుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో చాంపియన్స్ గా అవతరించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా, బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియాకు రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని జై షా స్వయంగా వెల్లడించారు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతమైన ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి కనబర్చిందని కొనియాడారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, ఇతర సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జై షా పేర్కొన్నారు. టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.

Related posts

తన రికార్డు తానే బద్దలు కొట్టిన సన్ రైజర్స్… ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు…

Ram Narayana

డెత్ ఓవ‌ర్ల మొన‌గాడు దినేష్ కార్తీక్

Ram Narayana

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారతీయ క్రికెటర్‌గా అవతరణ

Ram Narayana

Leave a Comment