Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రోహిత్ శర్మకు ప్రధాని మోదీ నుంచి ఫోన్ కాల్…

  • టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా
  • రోహిత్ సేనపై అభినందనల వెల్లువ
  • రోహిత్ శర్మకు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ

తిరుగులేని ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియాపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

“ప్రియమైన రోహిత్ శర్మ… అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం. నీ దూకుడు మనస్తత్వం, ధాటియైన బ్యాటింగ్, చురుకైన కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త కోణాన్ని జోడించాయి. నీ టీ20 కెరీర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇవాళ ఉదయం నీతో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది”  అంటూ రోహిత్ తో ఫోన్ లో తానేం మాట్లాడారో ప్రధాని వెల్లడించారు.

Related posts

పొలంలో నాట్లు వేసిన రాహుల్ గాంధీ..

Drukpadam

రామమందిర ప్రారంభోత్సవం కోసం.. 108 అడుగుల అగరబత్తీ తయారీ!

Ram Narayana

సిగ్నల్‌కు బురద పూసి దోపిడీకి యత్నం.. ప్రయాణికులు ఎదురు తిరగడంతో పరార్..

Ram Narayana

Leave a Comment