జాతీయ వార్తలు

లడఖ్ లో ఘోర ప్రమాదం… 9 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం

  • లోయలో పడిన సైనిక వాహనం
  • లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఘటన
  • సైనిక బలగాల కారు గారిసన్ నుంచి ఖేరీ వెళుతుండగా ప్రమాదం

లడఖ్ లో నేడు ఘోర ప్రమాదం సంభవించింది. ఓ సైనిక వాహనం లోయలో పడిన ఘటనలో 9 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

ఇవాళ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సైనిక బలగాల కారు గారిసన్ ప్రాంతం నుంచి ఖేరీ తరలి వెళుతుండగా అదుపుతప్పి, లోతైన లోయలోకి పడిపోయిందని అధికారులు వెల్లడించారు.

Related posts

మహిళల పథకంలో లబ్దిదారులుగా మగవాళ్లు.. మహారాష్ట్రలో అక్రమాలు…

Ram Narayana

ఈ బైబిల్ పొడవు 100 కిలోమీటర్లు… చేతితో రాశారు!

Ram Narayana

రైల్వే సరికొత్త ఆఫర్.. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’తో టికెట్ ధరలో రాయితీ…

Ram Narayana