Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు…

  • ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
  • అధికారులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన ముఖ్యమంత్రి యోగి
  • హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసిన ఈస్టర్న్ రైల్వే

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా – మన్కాపూర్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చింది.

Related posts

‘ఇండియా’ కూటమి నిన్నటి సెమీఫైనల్స్ లోనే ఓడిపోయింది: ప్రధాని మోదీ ఎద్దేవా

Ram Narayana

అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

Ram Narayana

భారత సంపన్నుల్లో నెం.1గా ముఖేశ్ అంబానీ! తెలుగువారిలో టాప్ ఎవరంటే..!

Ram Narayana

Leave a Comment