Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు…

  • ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
  • అధికారులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన ముఖ్యమంత్రి యోగి
  • హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసిన ఈస్టర్న్ రైల్వే

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా – మన్కాపూర్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చింది.

Related posts

ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పై అంతస్తు నుండి దూకేశారు…!

Drukpadam

ఇకపై జాతీయ హైవేలపై గుంతలుండవు: నితిన్ గడ్కరీ

Ram Narayana

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు.. శంషాబాద్‌లో విస్తృతంగా తనిఖీలు…

Ram Narayana

Leave a Comment