తెలంగాణ వార్తలు

గోదావరికి పోటెత్తుతున్న వరద… సమీక్ష చేపట్టిన మంత్రి పొంగులేటి…

  • తెలంగాణలో భారీ వర్షాలు
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
  • జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొంగులేటి 

గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు వల్ల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, ఈ క్రమంలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్లు కూడా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఉప్పొంగుతున్న వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలెవరూ వాగులు దాటకుండా చూడాలని సూచించారు. 

రాష్ట్రస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, వారిని జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడైనా సంప్రదించవచ్చని మంత్రి పొంగులేటి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురుస్తున్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Godavari water level raises at Bhadrachalam

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts

విప్లవోద్యమ వేగుచుక్క గద్దర్…టియుడబ్ల్యూజె (ఐజేయు)

Ram Narayana

డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం… దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్

Ram Narayana

నేటి నుంచి మేడారం చిన్న జాతర.. తరలి వస్తున్న భక్తులు…

Ram Narayana