Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద కేసు నమోదు…

జూబ్లీహిల్స్ – నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్లో జీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డీవీఎం అధికారులు.

అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు.

అధికారులు వస్తుంటారు..పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అంటున్న నాగేందర్

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి మరి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ – నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్ లో జీహెచ్ఎంసీ పార్క్ లో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై డీవీఎం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందని.. అందుకే తనపై కేసు పెట్టారని ఎద్దేవా చేశారు. అలాగే అధికారులు వస్తుంటారు..పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని చెప్పుకొచ్చారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటనపై సదరు అధికారులకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇస్తానని.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.

Related posts

ఘోరం.. అంబులెన్స్ లో మహిళకు వేధింపులు.. ఆక్సిజన్ అందక పేషెంట్ మృతి!

Ram Narayana

ఆయిల్ ఫామ్ మీద కేంద్రం నిబంధన సరికాదు…ఎమ్మెల్యే సండ్ర

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana

Leave a Comment