తెలంగాణ వార్తలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్

  • ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
  • జులై 7తో ముగిసిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం
  • పీసీసీ కోసం పోటీ పడిన సీనియర్ నేతలు మధుయాష్కీ, బలరాం నాయక్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది.

దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.

Related posts

ఇంటర్ పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో దిద్దుకోలేని నిర్లక్ష్యం…విద్యార్థులకు శాపం …

Ram Narayana

ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ ,డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

తెలంగాణకు మరో 7 కొత్త నవోదయ విద్యాలయాలు మంజూరు…

Ram Narayana