Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఈ బైబిల్ ధర రూ.57 కోట్లు!

  • 14వ శతాబ్దం నాటి బైబిల్ కు కళ్లు చెదిరే ధర
  • 1312వ సంవత్సరంలో బైబిల్ ను గ్రంథస్తం చేసిన రబ్బీ షెంతోవ్ ఇబ్న్ గావ్
  • న్యూయార్క్ లోని సోత్ బీ సంస్థ వేలం

క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్. దేవుని వాక్యాలతో కూడిన బైబిల్ గ్రంథాన్ని చాలా వరకు ఉచితంగానే అందిస్తుంటారు. అయితే ఓ బైబిల్ రూ.57 కోట్ల ధర పలకడం విశేషం అని చెప్పుకోవాలి. 

ఇది 14వ శతాబ్దం నాటి బైబిల్. దీన్ని స్పెయిన్ కు చెందిన రబ్బీ షెంతోవ్ ఇబ్న్ గావ్ రాశారు. 1312వ సంవత్సరంలో స్పెయిన్ లోని సోరియా ప్రాంతంలో ఆయన ఈ పుస్తకం పూర్తి చేశారు. 

ఇది 800 పేజీల బైబిల్. పాండిత్యం, పదాల ఎంపిక, సాంస్కృతిక కళాత్మకత వంటి అంశాల కలబోత ఈ బైబిల్ అని చెప్పవచ్చు. న్యూయార్క్ లోని సోత్ బీ వేలం కేంద్రంలో ఈ పురాతన బైబిల్ ను వేలం వేయగా, కళ్లు చెదిరే ధరను సొంతం చేసుకుంది.

Related posts

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి.. కెనడా మంత్రి కీలక ప్రకటన

Ram Narayana

అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అధ్యక్షుడు జో బైడెన్ భార్యకు పాజిటివ్

Ram Narayana

 హర్యానాలో మత ఘర్షణలపై అమెరికా స్పందన

Ram Narayana

Leave a Comment