Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చిచంపిన దుండగులు

  • ముంబైలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో కాల్పులు
  • ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న బాబా సిద్ధిక్
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేసిన సీనియర్ నేత

ముంబైలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత బాబా సిద్ధిక్ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఆయనను దుండగులు కాల్చిచంపారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో షూటర్లు ఆయనపైకి ఆరు బుల్లెట్లు కాల్చారు. బాబా సిద్ధిక్‌కు 4 బుల్లెట్లు తగిలాయి. అతడి సహాయకులలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా తన కొడుకు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ కార్యాలయానికి సమీపంలోనే బాబా సిద్ధిక్‌పై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

బాబా సిద్ధిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -2008 మధ్య రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గంలో చేరారు. మరోవైపు ఆయన కొడుకు జీషాన్ సిద్ధిక్‌ను ఈ ఏడాది ఆగస్టులో పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.

బాబా సిద్ధిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ‘‘ ఈ ఘటన చాలా దురదృష్టకరం. సిద్ధిక్ చనిపోయారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నేను కోరాను. ముంబయిలో శాంతిభద్రతలను ఎవరూ వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు’’ అని ఆయన అన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. సిద్ధిక్ హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాబా సిద్ధిక్ హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్.. అన్నట్టుగానే బాబా సిద్దిఖీ హత్య

Baba Siddique Received Death Threat 15 Days Ago

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికార వర్గాల సమాచారం మేరకు.. పదిహేను రోజుల క్రితమే బాబా సిద్ధిఖీని చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. దీంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా.. అధికారులు ఆయన సెక్యూరిటీని పెంచి వై కేటగిరి రక్షణ కల్పించారు. సిద్ధిఖీకి కన్ స్ట్రక్షన్ బిజినెస్ ఉందని అధికారులు చెప్పారు. హెచ్చరికలు పంపిన వ్యక్తులు బిజినెస్ కు సంబంధించిన వారేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. సిద్ధిఖీ హత్యకు దుండగులు 9.9 ఎంఎం పిస్టల్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ హత్య కాంటాక్ట్ కిల్లింగ్ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అదే సమయంలో ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. బాబా సిద్ధిఖీ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దగ్గరి స్నేహితులు.. ఇటీవల సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో బాబా సిద్ధిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్రలో సీనియర్ రాజకీయవేత్త అయిన బాబా సిద్ధిఖీ గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సిద్ధిఖీ కుమారుడు జీషాన్ బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే.

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక సూత్రధారి శరత్ చంద్రారెడ్డే.. రిమాండ్ రిపోర్టులో ఈడీ!

Drukpadam

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై ఏమన్నారంటే?

Ram Narayana

ఒరిగిపోతున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం!

Drukpadam

Leave a Comment