Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన జగన్..!

  • నేడు ఇడుపులపాయ వచ్చిన జగన్
  • ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • పులివెందులలో మూడ్రోజుల పాటు ఉండనున్న మాజీ సీఎం

వైసీపీ అధినేత జగన్ ఇవాళ బెంగళూరు నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వచ్చారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జగన్ ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

అనంతరం పులివెందుల బయల్దేరి వెళ్లారు. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడ్రోజుల పాటు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. జగన్ ఇడుపులపాయ పర్యటనకు సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి విడదల రజని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Related posts

ఎయిరిండియా విమానంలో దట్టమైన పొగలు… 14 మందికి అస్వస్థత!

Drukpadam

పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్

Drukpadam

Meet The Women At The Head of The Gym Revolution

Drukpadam

Leave a Comment