Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఇది అధర్మ కాంటా…రైతులకు టోకరా!

పత్తి కొనుగోళ్లలో దళారులు చేస్తున్న మాయ ఇది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇటీవల కొందరు రైతులు ఈ మోసాన్ని గుర్తించారు. చిన్న రైతులు రవాణా వ్యయప్రయాసలు భరిం చలేక పత్తిని గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు.

మార్కెట్ కంటే క్వింటాపై రూ.100- 200 ఎక్కువ చెల్లిస్తామంటూ దళారులు చెబుతుండడం మరో కారణం.

రైతుల ఇళ్లు, పొలాల వద్దకే దళారులు వాహనంలో యంత్రాలను తీసుకెళ్లి పంటను తూకం వేస్తారు. ఆ యంత్రంలో ఒక చిప్ను అమరుస్తున్నారు.

50-100 మీటర్ల దూరం నుంచి రిమోట్ తో ఈ చిప్ను నియంత్రించవచ్చు.

రిమోట్ లోని బటన్ ను ఒకసారి నొక్కితే.. 5 కిలోలు, రెండుసార్లు నొక్కితే 10 కిలోలు తగ్గేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరికొందరు యంత్రాల్లో ముందుగానే 5 నుంచి 10 కిలోలు తగ్గేలా సర్దుబాటు చేసుకొని మోసగిస్తున్నారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పత్తి రైతు కుమారస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ’40-45 కిలోలు తూగాల్సిన పత్తి బస్తాను కాంటా పై పెడితే, 35 కిలోలే చూపించడంతో అను మానం వచ్చింది.

అదే యంత్రంపై 90 కిలోల బరువున్న వ్యక్తిని నిలబెట్టగా.. 68 కిలోలే చూపింది. ఓ వ్యక్తి దూరంగా నిలబడి, జేబులో ఉన్న రిమోట్తో బరువును నియంత్రిస్తున్నట్లు గమనించి.. వారిని పోలీసులకు అప్పగించాం’ అని ఆయన తెలిపారు.

Related posts

తీహార్ జైలు నుంచి సీక్రెట్ ఆఫీస్ నడుపుతున్న యూనిటెక్ వ్యవస్థాపకులు!

Drukpadam

పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్!

Drukpadam

ఈటల కబ్జా నిజమే మెదక్ కలెక్టర్ ….

Drukpadam

Leave a Comment