Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నాం: అల్లు అరవింద్

  • సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్
  • శ్రీతేజ్ కోలుకుంటున్నాడన్న అల్లు అరవింద్
  • రూ. 2 కోట్ల చెక్కులను దిల్ రాజుకు అందించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ‘పుష్ప-2’ టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను, ఆయన తండ్రిని పరామర్శించారు. 

అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ… శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, ‘పుష్ప-2’ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని… ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.

Related posts

పార్వతి అమ్మాళ్ కు రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన హీరో సూర్య!

Drukpadam

బిగ్ బీకి కోపం వచ్చింది …కొడుకు కోడలు వీడిపోతున్నారనే వార్తలపై మండిపాటు

Ram Narayana

నిర్మాతల కష్టాన్ని హీరోలు పట్టించుకోవట్లేదంటూ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment