Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీ దేశం కోసం కాంగ్రెస్ అధ్యక్ష భాద్యతలు చేపట్టాలి :సీఎల్పీ నేత భట్టి…

రాహుల్ గాంధీ దేశం కోసం కాంగ్రెస్ అధ్యక్ష భాద్యతలు చేపట్టాలి :సీఎల్పీ నేత భట్టి
-ఈ మేరకు లేఖ రాయనున్నట్లు వెల్లడి
-కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాలి
-పాదయాత్ర ప్రజలకు ధైర్యాన్ని భరోసాను కల్పిస్తుంది
-విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ
మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూల్చేస్తోంది
-యువతలో నిరాశ ఉంది
-దేశ భవిష్యత్ అంధకారంగా మారుతోంది

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని,భరోసాను ఇస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు . దేశ నిర్మాణానికి సంబంధించి , విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు . ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించాలని కోరుతూ సీఎల్పీ పక్షాన లేఖ రాస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, కరోనా బాధితులకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిందని చెప్పారు. అదే విధంగా ఎన్.ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాలు ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చేలా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించందని అన్నారు.

కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు గత 70 ఏళ్లుగా ఎన్నో రకాల వ్యవస్థలను దేశ ప్రజల కోసం నిర్మాణం చేశాయి. ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు అవసరమైన అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించాయి. అందులో భాగంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వం రంగ సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు.. సహా ఎన్నింటినో నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిందన్నారు.

ఉన్న ఉద్యోగాలు నిలబెట్టుకోలేక, కొత్త ఉద్యోగాల కల్పన జరగక యువత నిరాశలో ఉంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవస్థలను కూలుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు . శనివారం మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనాతో నేడు దేశమంతా అతలాకుతలమై తల్లడిల్లుతోందని , ఏడాది కాలంగా కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తూ.. లక్షలాది మరణాలకు కారణమైందని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సందర్భంలో.. ‘‘దేశానికి ముప్పు దాపురించి ఉంది.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, ప్రభుత్వాన్ని హెచ్చరించినా కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు . రాహుల్ గాంధీ విజన్ ను, ఆయన మాటలను దేశ ప్రధాని మోదీ పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని అన్నారు .

ఇవాళ దేశం మీద ఏ మాత్రం అవగాహలేని పాలకులు, కేవలం ప్రచార్భాటం, మాటలతో బతికే ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను కూలుస్తున్నాడన్నారు. దేశ ప్రజలంతా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకువచ్చాడని చెప్పారు. ఉద్యోగాలు లేక యువత నిరాశతో ఉందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారా అనేక రకాల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు స్రుష్టించాయి.. కానీ మోదీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి ఉద్యోగాలు లేకుండా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానిక పెట్టడం ద్వారా దేశ నిర్మాణాన్ని మోదీ ఫణంగా పెట్టారని విమర్శించారు.

ప్రజారోగ్యాన్ని పక్కకు పెట్టి.. కరోనాతో కొన్ని లక్షలమంది చనిపోవడానికి మోదీ కారణమయ్యారని అన్నారు. కరోనా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. లాక్ డౌన్ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లక్షలమంది వలస కూలీలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కొన్ని నెలలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయని అన్నారు. మొత్తం దేశ భవిష్యత్తే అంధకారంగా మారుతోందన్నారు.

రాజీవ్ గాంధీ హయాంలో దేశాన్ని ప్రపంచంలో మూడో శక్తిగా తీర్చిదిద్దిన విషయాన్నీ గుర్తు చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించారు. అమెరికా, రష్యా లతో సమానంగా దేశాన్ని నడిపించారని వివరించారు . మన్మోహన్ సింగ్ ప్రధానిగా, శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ గా దేశంలో ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలను తీసుకువచ్చాం. ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయిమెంట్, ఆహార భద్రత వంటివి తెచ్చామని అన్నారు . అందువల్ల రాహుల్ విజన్ దేశానికి ఏంటో అవసరం అని ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ముందుకు పోతుందని పేర్కొన్నారు …

Related posts

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ భేటీ!

Drukpadam

కేంద్రం రూ.1 కోటి నగదు పురస్కారాన్ని తిరస్కరించిన గీతాప్రెస్… ఎందుకంటే?

Drukpadam

ఏపీ లో జోష్ మీద ఉన్న ఉద్యోగ సంఘాలు …సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపున్న నేతలు …

Drukpadam

Leave a Comment