Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఈ నెల 29 వరకు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత…

  • ముగిసిన మండల దీక్షల సీజన్
  • నిన్న మండల పూజ అనంతరం ఆలయం మూసివేత
  • ఈ నెల 30న తిరిగి తెరుస్తామన్న ఆలయ వర్గాలు
  • జనవరి 14న మకర విళక్కు

దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది. నిన్న మధ్యాహ్నం మండల పూజ అనంతరం ఆలయం మూసివేశారు. 

ఈ నెల 29 వరకు ఆలయం మూసి ఉంచుతామని, తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. 

జనవరి 14న మకర విళక్కు పర్వదినం సందర్భంగా లక్షలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివస్తారు. 

కాగా, ఈ ఏడాది అయ్యప్పస్వామిని 32,39,756 మంది దర్శించుకున్నారు. గతేడాది 28,42,447 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Related posts

స్వాతి మాలివాల్‌పై దాడి కేసు మీద తొలిసారి స్పందించిన కేజ్రీవాల్..

Ram Narayana

కుంభమేళా చివరి రోజు 1.32 కోట్ల భక్తుల పుణ్యస్నానాలు… హెలికాప్టర్లతో పూలు జల్లిన ప్రభుత్వం!

Ram Narayana

6 గంటల్లో ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం.. నీట మునిగిన ముంబై…

Ram Narayana

Leave a Comment