Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం …

  • ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 22లోని ఛట్‌నాగ్ ఘాట్ వద్ద మంటలు
  • కాలిపోయిన 15 గుడారాలు
  • ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 22లోని ఛట్‌నాగ్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 15 గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దాదాపు పదిరోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగిన ఘటనలో 18 టెంట్లు కాలిపోయాయి. అంతేకాకుండా, నిన్న జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Related posts

ప్రియాంక గాంధీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే..??

Ram Narayana

ఢిల్లీ కొత్త సీఎం అతిశీకి నగలు, ఆస్తులు లేకున్నా కోటీశ్వరురాలే!

Ram Narayana

తమిళనాడులో రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ ట్వీట్

Ram Narayana

Leave a Comment