Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!

  • మంత్రి వర్గ ఉపసంఘానికి రేపు అందనున్న కుల గణన నివేదిక
  • కుల గణన నివేదికకు ఆమోదం తెలపనున్న మంత్రి వర్గం
  • కుల గణన నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రభుత్వం కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కుల గణన నివేదిక రేపు మంత్రివర్గ ఉపసంఘానికి అందుతుందని తెలిపారు. అనంతరం, ఈ నెల 5న మంత్రివర్గం ముందు కుల గణన నివేదికను ఉంచుతామని చెప్పారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత కుల గణన నివేదికను అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఇందుకోసం ఈ నెల 5న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని ఆయన వెల్లడించారు.

Related posts

యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి …

Ram Narayana

ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు

Ram Narayana

సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించండి …మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment