Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు!

  • మూడ్రోజులుగా బెదిరింపు కాల్స్
  • తనిఖీలు నిర్వహించి బాంబు లేదని గుర్తించిన పోలీసులు
  • నిందితుడిని అదుపులోకి పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా ఎక్కడా బాంబు లేదని తేల్చారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బెదిరింపు ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని సయ్యద్ మీర్ మొహమూద్ అలీ (22)గా గుర్తించారు. ఎస్పీఎఫ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related posts

‘హైడ్రా’ పేరిట రేవంత్ ప్ర‌భుత్వం వ‌సూళ్లు.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Ram Narayana

బండారు దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!

Ram Narayana

ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడగ్గానే మెడలోంచి బంగారు గొలుసు తీసిచ్చిన జగ్గారెడ్డి…

Ram Narayana

Leave a Comment