తెలంగాణ వార్తలు

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు!

  • మూడ్రోజులుగా బెదిరింపు కాల్స్
  • తనిఖీలు నిర్వహించి బాంబు లేదని గుర్తించిన పోలీసులు
  • నిందితుడిని అదుపులోకి పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించగా ఎక్కడా బాంబు లేదని తేల్చారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బెదిరింపు ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని సయ్యద్ మీర్ మొహమూద్ అలీ (22)గా గుర్తించారు. ఎస్పీఎఫ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related posts

సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది…కిషన్ రెడ్డి

Ram Narayana

ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తాం

Ram Narayana

ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరించింది వాళ్లే… మొసలి కన్నీరు కారుస్తోంది వాళ్లే: ఈటల

Ram Narayana