Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజుపై వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన వైసీపీ

రఘురామకృష్ణరాజుపై వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన వైసీపీ

వైసీపీ ఎంపీల తరపున ఓం బిర్లాకు లేఖ రాసిన విజయసాయిరెడ్డి
గత ఏడాది జులై 3న ఫిర్యాదు చేశామని లేఖలో పేర్కొన్న విజయసాయి
ఇంతవరకు అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్య

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ నేతలు లేఖ రాశారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశాన్ని వారు మరోసారి లేవనెత్తారు.

రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న తమకు ఫిర్యాదు చేశామని… అయితే అకారణంగా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ లేఖలో వారు పేర్కొన్నారు. పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

Related posts

క్షమాపణ చెప్పకపోతే సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదు.. 12 మంది ఎంపీలపై కేంద్రం!

Drukpadam

ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్!

Drukpadam

పార్టీ కోసం ప్రాణాలిస్తామన్న వారే పారిపోయారు..ఉద్ధవ్​ థాకరే!

Drukpadam

Leave a Comment