తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఆరు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆరు నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తమ అధినేతకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అసెంబ్లీ గేటు వద్ద స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు వెంటరాగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సభలో అనుసరించాల్సిన పద్ధతిపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Related posts

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారింది: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Ram Narayana

ఏ జిల్లానూ రద్దు చేయబోవడం లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

బీసీలకు సీట్లు, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

Ram Narayana