Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని సానుకూలం :గులాంనబీ ఆజాద్…

జమ్మూ కాశ్మీర్  రాష్ట్ర హోదాకు ప్రధాని సానుకూలం :గులాంనబీ ఆజాద్-జమ్మూకశ్మీర్ నేతలతో ముగిసిన ప్రధాని మోదీ సమావేశం
-నియోజకవర్గాల పునర్విభజన కు సహకరించాలని ప్రధాని కోరారు
-ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో అఖిలపక్షం
-కశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేశాక తొలి భేటీ
-8 పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరు
-ప్రధాని ముందు 5 డిమాండ్లు

జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారి కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. జమ్మూకశ్మీర్ లోని 8 పార్టీలకు చెందిన 14 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మరోనేత అల్తాఫ్ బుఖారీ తదితరులు ఈ సమావేశానికి విచ్చేశారు.

రాష్ట్ర హోదాకు ప్రధాని కట్టుబడి ఉన్నానని చెప్పారు …గులాంనబీ ఆజాద్

దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ అఖిలపక్ష భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ప్రధానిని కోరామని అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రధాని చెప్పారని ఆజాద్ వివరించారు. ప్రధాని ముందు 5 డిమాండ్లు ఉంచామని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని, కశ్మీర్ లోయలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహించాలని, కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, జమ్మూకశ్మీర్ ప్రజల భూ హక్కులకు భద్రత కల్పించాలని కోరినట్టు ఆజాద్ వెల్లడించారు.

అల్తాఫ్ బుఖారీ స్పందిస్తూ, నేతలు చెప్పిన విషయాలను ప్రధాని సావధానంగా విన్నారని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు అని ప్రధాని తెలిపారని బుఖారీ పేర్కొన్నారు. పునర్విభజన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ప్రధాని కోరారని తెలిపారు.

ప్రధాని నుంచి స్పష్టమైన హామీ ఏది లభించలేదు …. సిపిఎం నేత తరగామి

ప్రధాని అధ్యక్షతన జరిగిన జమ్మూ కాశ్మీర్ నేతల సమావేశంలో ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని సిపిఎం నేత యూసుఫ్ తరగామి అన్నారు .సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని చెప్పినవన్నీ విన్నప్పటికి ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఒక్క విషయమైతే చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజనలో అందరు సహకరించాలని కోరారు .

మేము ఎంతో ఆశతో సమావేశానికి వచ్చాం .కాని మేము చెప్పిన విషయాలను , ప్రధాని కాని , సమావేశంలో పాల్గొన్న అమిత్ షా గాని అడ్రెస్స్ చేయలేదు … రాష్ట్ర హోదా అంశం అంటే ఉంది . దానిపై ఎలాంటి ప్రకటన చెల్లదని అన్నారు. రాష్ట్ర హోదా ను ఎవరిని అడగకుండానే తీసివేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా రాష్ట్ర హోదా లేదు .దురదృష్ట వశాత్తు దానిపై ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు.

Related posts

కేంద్ర మంత్రిపై హరీశ్ రావు ఫైర్‌…

Drukpadam

కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ…

Drukpadam

అంద‌రి వ‌ద్దా మొబైల్ ఫోన్ ఉంది.. వాటిలో కంటెంట్‌ను నియంత్రించాలి: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌!

Drukpadam

Leave a Comment