ప్రమాదాలు ...

తమిళనాడులో విషాదం.. బాణసంచా పేలి ఏడుగురి మృత్యువాత!


తమిళనాడులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బాణసంచా పేలుళ్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బాలురు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విరుదునగర్, సేలం జిల్లాల్లో ఈ ప్రమాదాలు సంభవించాయి. 

విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు రసాయనాల మిశ్రమాన్ని సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేలం జిల్లా కంచనాయకన్‌పట్టి గ్రామంలో ద్రౌపది అమ్మవారి ఆలయ రథోత్సవం సందర్భంగా కొందరు బాణసంచా కాల్చారు. ఆ నిప్పు రవ్వలు బైక్‌పై ఉంచిన బాణసంచా బస్తాపై పడి అంటుకున్నాయి. అందులో శక్తిమంతమైన టపాసులు పేలడంతో 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మలావి విమానం గల్లంతు విషాదాంతం… ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం…

Ram Narayana

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు ఏపీ యువకుల మృతి

Ram Narayana

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం… బస్సు లోయలో పడి 21 మంది మృతి…!

Ram Narayana