తెలంగాణ వార్తలు

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క భేటీ!

  • చెట్ల తొలగింపు పనులను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
  • ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క చర్చ

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితోనూ చర్చిస్తుంది.

కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మల్లు భట్టివిక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

Related posts

నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ గా శ్రీపాల్ రెడ్డి విజయం …

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు…

Ram Narayana

ఇంగ్లీపిస్ వస్తేనే గొప్పకాదు …సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana