CM Revanth Reddy, AM Rathnam
సినిమా వార్తలు

సీఎం రేవంత్‌తో ఏఎం రత్నం భేటీ: ‘హరిహర వీరమల్లు’ ‘టిక్కెట్ ధరలపై చర్చ

  • ‘హరిహర వీరమల్లు’ సినిమా విశేషాలపై ఇరువురి మధ్య చర్చ
  • తెలంగాణలో సినిమా టికెట్ ధరల గురించి ప్రస్తావన
  • 17వ శతాబ్దపు కథాంశంతో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం
  • జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘హరిహర వీరమల్లు’

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. నిర్మాణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, 17వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఏఎం రత్నం ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. తమ సినిమాకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి విలువైన సమయాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఏఎం రత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

ఇది పవన్ క‌ల్యాణ్ పై దాడి కాదు… థియేటర్ల వ్యవస్థపై దాడి:ఎన్వీ ప్రసాద్

Drukpadam

హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్

Ram Narayana

అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి క్లారిటీ!

Ram Narayana