Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సినీ నటుడు మోహన్ బాబు పై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు …

సినీ నటుడు మోహన్ బాబు పై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు …
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కేసు …
-గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం పిలుపు మేరకు కేసు పెట్టమన్న సంఘ నాయకులు
-గుర్రెలు మేపుకునే వాడిదగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది .ఏమి జరుగుతుందో చేస్తున్నదన్న మోహన్ బాబు
– మమ్ములను అవమానపరిచాడని కించపరిచాడని గొర్రెల కాపర్ల మనస్తాపం

సినీ నటుడు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని.పిటిషన్ ఇవ్వడం జరిగింది.
గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.
సీనియర్ నటుడు,మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా,,ఎం.మోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. అని అన్నందుకు దీనిపై గొర్రెల కాపర్లు మనస్తాపం చెందారు. మా గౌరవాన్ని , మా వృత్తి ని అవమాన పరుస్తూ మాట్లాడారు. గొర్రెలు కాసుకునే వాళ్ళు చూస్తుంటే సినీతారల గౌరవం పోతుందన్నట్టు అర్థం వచ్చేలా గొర్లకాపరులను కించపరిచేలా మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. కావున గొర్రెలకాపరులు కించపర్చేలా మాట్లాడిన మోహన్ బాబు గారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్.సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు. రాము. లాలయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ పిటిషన్ స్వీకరించిన పోలీసులు దర్యాప్తు జరిపి పైఅధికారుల ఆదేశాల ప్రకారం కేసు ను కడతారా ?లేదా ?అనేది నిర్ణయించాల్సి ఉంది.

Related posts

వాసాలమర్రిలో సీఎం స్నేహితురాలు ఆగమ్మకు అస్వస్థత!

Drukpadam

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

Drukpadam

అమెరికాకు వెళ్లిపోయిన వైఎస్ విజయమ్మ?

Ram Narayana

Leave a Comment