Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం

గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
– ల్యాండింగ్ సందర్భంగా అపశృతి
-ప్రయాణికులు సురక్షితం
దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిర్ ఇండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎయిరిండియా విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు వెల్లడించారు. కాగా, దెబ్బతిన్న విమానం రెక్కలకు మరమ్మతులు నిర్వహించేందుకు నిపుణుల బృందం గన్నవరం వస్తుందని అధికారులు తెలిపారు.

Related posts

పువ్వాడను కమ్మ కులం నుంచి బహిష్కరించాలన్న రేవంత్… ఏ విచారణకైనా సిద్ధమన్న పువ్వాడ

Drukpadam

పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంశంపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం!

Ram Narayana

లోకల్ బస్ స్టాండ్ కోసమే పాత బస్ స్టాండ్ …మాజీమంత్రి తుమ్మల

Drukpadam

Leave a Comment