Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాతబస్ స్టాండ్ ఉండాల్సిందే టీపీసీసీ చీఫ్-ఉత్తమ్ కుమార్ రెడ్డి…

పాత బస్ స్టాండ్ ఉండాల్సిందేఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజల కోరిక మన్నించాల్సిందే

పాత బస్ స్టాండ్ ఉండాల్సిందే దాన్ని లోకల్ బస్ స్టాండ్ గా వాడుకోవాలని ప్రజల డిమాండ్ న్యాయమనదేనని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం ఖమ్మం పర్యటనకు వచ్చిన ఆయన పాత బస్ స్టాండ్ ను పరిశీలించిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉన్న పాత బస్ స్టాండ్ లోకల్ బస్ ల కోసం ఉపయోగించుకోవాలనే ప్రజల కోరికను మన్నించాలని అన్నారు. గత కొన్ని రోజులుగా పాత బస్ స్టాండ్ ఇక్కడే ఉండాలని దాన్ని లోకల్ బస్ స్టాండ్ గా ఉపయోగించుకోవాలని రాజకీయ పార్టీల ఆధ్వరంలో పాత బస్ స్టాండ్ పరిరక్షణ పేరుతొ జరుగుతున్నా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. రవాణా మంత్రి స్థానికుడై ఉండి ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందేలా ముఖ్యమంత్రిని ఒప్పించి పాత బస్ స్టాండ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. 60 సంవత్సరాలుగా దీనిపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవిస్తుండగా వారి ఉపాధి కోల్పోయేలా చర్యలు ఉండకూడదని అన్నారు. బస్ మంచి కేంద్రంగా ఉంది. రైల్వే స్టేషన్ కు అతిదగ్గరుగా ఉండటం రోజు వచ్చి పోయోవారికి ఎంతో ఉపయోగ కరంగా ఉన్నదానిని కాపాడుకోవాల్సిన మంత్రి మొత్తం తరలిస్తామని చెప్పటం అవివేకం అన్నారు.

Related posts

1908 నాటి హార్లీ డేవిడ్ సన్ బైక్.. వేలంలో రూ. 7.72 కోట్లు!

Drukpadam

ఏపీ లో బియ్యం వద్దనుకునే వారికీ నగదు బదిలీ ….

Drukpadam

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభం…

Drukpadam

Leave a Comment