Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆస్ట్రేలియాలో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు…

ఆస్ట్రేలియాలో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు…

  • ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన మోసిన్ అలీ
  • డిసెంబర్ 30వ తేదీ నుంచి అదృశ్యం
  • ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. వారం రోజులుగా ఆ యువకుడి ఆచూకీ తెలియడం లేదు. వివరాల్లోకి వెళ్తే, నగరానికి చెందిన మహ్మద్ మోసిన్ అలీ (28) ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఆయన చదువుకుంటున్నాడు.

అయితే డిసెంబర్ 30 నుంచి అతనికి కుటుంబసభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అలీ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అలీ అదృశ్యం వివరాలను ఆయన సోదరుడు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు, అలీ అదృశ్యంపై ఆస్ట్రేలియాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చంద్రబాబు నివాసం అటాచ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరిన సీఐడీ!

Drukpadam

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష!

Drukpadam

భారత సంతతి చిన్నారి కోసం సింగపూర్ లో రూ.16.68 కోట్ల విరాళాలు!

Drukpadam

Leave a Comment