Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెరూలో ఘోర బస్సు ప్రమాదం… 20 మంది దుర్మరణం…

పెరూలో ఘోర బస్సు ప్రమాదం… 20 మంది దుర్మరణం…

  • టయబంబా నుంచి ట్రుజిల్లో వెళుతున్న బస్సు
  • మారుమూల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
  • 100 మీటర్ల వాలులోకి జారిపోయిన బస్సు
  • 30 మందికి గాయాలు

పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. 30 మంది క్షతగాత్రులయ్యారు. బస్సు టయబంబా ప్రాంతం నుంచి ట్రుజిల్లో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పైనుంచి పక్కనే ఉన్న 100 మీటర్ల వాలులోకి జారిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం ఓ మారుమూల ప్రాంతంలో ఉంది. దాంతో, ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వరకు అధికారులకు సమాచారం అందలేదు.

ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయి. కేవలం 340 కిలోమీటర్లు ప్రయాణించడానికి 14 గంటల సమయం పడుతుంది. గతుకుల రోడ్లు, కొండ ప్రాంతాలు, అధికవేగం వంటి కారణాలతో పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గత నవంబరులో ఉత్తర పెరూ అటవీప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.

Related posts

నాలుగు సార్లు లేఆఫ్స్.. తట్టుకోలేకపోతున్నానంటూ టెకీ ఆవేదన!

Drukpadam

ఆటో మొబైల్ రంగంలో పెనుమార్పులు -కేంద్రం కొత్త చట్టం

Drukpadam

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు… !

Drukpadam

Leave a Comment