Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ మేఘాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ మేఘాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 531 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఐదున్నర శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్
Sensex collapses amid war tensions between Ukrain and Russia

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఇదే భయాలతో మన మార్కెట్లు సైతం తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు  ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 1,747 పాయింట్లు కోల్పోయి 56,405కి పడిపోయింది. నిఫ్టీ 531 పాయింట్లు పతనమై 16,842 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టీసీఎస్ (1.05%) మాత్రమే లాభపడింది. టాటా స్టీల్ (-5.49%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-5.33%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (-5.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.52%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

Related posts

మీడియా స్వేచ్ఛను అణిచే ప్రయత్నంలా ఉంది …ఏబీఎన్, టీవీ5లపై కేసులో సుప్రీం వ్యాఖ్య…

Drukpadam

మండిపోతున్న ఎండలు.. లాగించేస్తున్న బీర్లు.. 17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన హైదరాబాదీలు!

Drukpadam

దేశ మంతా రైతుబంధు పీఎం కిసాన్ పేరుతో అమలు : హరీశ్ రావు!

Drukpadam

Leave a Comment