Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పర్యటనలో సీఎం జగన్… ఆసక్తికరమైన ఫొటోలు !

విశాఖలో పర్యటనలో సీఎం జగన్… ఆసక్తికరమైన ఫొటోలు !

  • విశాఖలో మిలన్-2022
  • హాజరైన సీఎం జగన్
  • పరేడ్ ను ప్రారంభించిన వైనం
  • ఐఎన్ఎస్ వేలా జలంతర్గామి సందర్శన

ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆయన ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన మిలన్ ఇంటర్నేషనల్ పరేడ్-2022 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేశారు. నావల్ డాక్ యార్డులో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని కూడా సందర్శించారు. తన పర్యటనలో భాగంగా ఆయన మిలన్ పరేడ్ ను ప్రారంభించారు.

ఈ పరేడ్ కు సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్ సముద్రంలో నౌకల విన్యాసాలను, గగనతలంలో జెట్ ఫైటర్ విమానాల విన్యాసాలను తిలకించారు. పరేడ్ సందర్భంగా తూర్పు నావికాదళం సీఎం జగన్ కు గౌరవవందనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ నేవీ టోపీ ధరించడం విశేషం. అంతేకాదు, ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిలో ప్రవేశించిన ఆయన దాంట్లోని వ్యవస్థలను ఎంతో ఆసక్తిగా పరిశీలించారు

Related posts

మార్పుతెచ్చే ఆయుధం జర్నలిస్టు కలమే….మంత్రి పువ్వాడ

Drukpadam

చీతాలను సరే బ్యాంకు మోసగాళ్లను ఎప్పుడు తీసుకొస్తారు ….మోదీపై ప్ర‌కాశ్ రాజ్ సెటైర్‌!

Drukpadam

లండన్‌లో రోడ్డు ప్రమాదం.. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తెలుగు యువకుడి మృతి

Ram Narayana

Leave a Comment