ఆంధ్రప్రదేశ్

ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా… ఎందుకంటే…!

ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా… ఎందుకంటే…!

  • దివ్యాంగుడ్ని విమానం ఎక్కించుకోని ఇండిగో సిబ్బంది
  • ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ
  • ఇండిగో సిబ్బంది తీరును తప్పుబట్టిన వైనం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) భారీ జరిమానా వడ్డించింది. దివ్యాంగుడైన ఓ బాలుడు విమానం ఎక్కేందుకు నిరాకరించిందన్న కారణంతో డీజీసీఏ ఇండిగో సంస్థకు రూ.5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన ఆ బాలుడ్ని రాంచీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో ఎక్కించుకోకుండా, ఇండిగో సిబ్బంది వ్యవహరించిన తీరు సరికాదని డీజీసీఏ పేర్కొంది.

అతడిని విమానం ఎక్కించుకోకపోగా, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే దిశగా ఇండిగో సిబ్బంది చర్యలు ఉన్నాయని వెల్లడించింది. ఆ దివ్యాంగుడైన బాలుడితో దయతో వ్యవహరించి ఉంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదని డీజీసీఏ తెలిపింది.

ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనే కొన్ని అసాధారణ స్పందనలు కనబర్చాల్సి ఉంటుందని, కానీ సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆ విషయంలో విఫలమయ్యారని, పౌర విమానయాన స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించింది. కాగా, ఇటువంటి సంఘటనల నివారణకు త్వరలోనే నియమావళిని పునఃసమీక్షిస్తామని డీజీసీఏ వెల్లడించింది.

Related posts

అల్లూరి జిల్లాలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు… ఇద్దరి మృతి

Ram Narayana

Barely Into Beta, Sansar Is Already Making Social VR Look Good

Drukpadam

మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి.. తొలి సంతకం దేనిపై పెట్టారంటే..!

Ram Narayana