Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బతికున్న వ్యక్తిపై మట్టి కప్పేశారు… కాపాడే క్రమంలో చంపేశారు!

బతికున్న వ్యక్తిపై మట్టి కప్పేశారు… కాపాడే క్రమంలో చంపేశారు!

  • తమిళనాడులో విషాద ఘటన
  • మధురైలో ఓ కాలనీలో డ్రైనేజీ పనుల్లో అపశ్రుతి 
  • గుంతలో ఉన్న వ్యక్తిని గమనించకుండా మట్టి కప్పిన వైనం
  • కాపాడుతుండగా తల తెగిపోయి వ్యక్తి మృతి

తమిళనాడులో అత్యంత విషాద ఘటన జరిగింది. మధురైలో ఓ వ్యక్తి అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడి విలాంగుడి ప్రాంతంలో రామమూర్తి నగర్ వద్ద డ్రైనేజి పైపుల పని జరుగుతోంది. సతీష్ అలియాస్ వీరనన్ అనే కార్మికుడు కూడా ఈ పనిలో ఉన్నాడు. అయితే, 11 అడుగుల గుంతలో ఉన్న సతీష్ ను గమనించకుండా, పైపులపై మట్టి కప్పేశారు. దీంతో ఆ గుంతలో మట్టి కింద అతను చిక్కుకుపోయాడు. కాసేపటి తర్వాత సతీష్ ను కూడా తాము పూడ్చేశామని గ్రహించిన ఇతర కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వెంటనే అక్కడే ఉన్న ఓ జేసీబీ సాయంతో ఆ గుంతను తిరిగి తవ్వడం ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జేసీబీ హ్యాండ్ తగిలి సతీష్ తల తెగిపోయింది. ఈ ఘటనలో సతీష్ మృతి చెందడంతో తోటి పనివాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది.

నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైట్ ఇంజినీర్ సికందర్, సూపర్ వైజర్ బాలు, జేసీబీ ఆపరేటర్ సురేశ్ లను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు సతీష్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

Related posts

అమెరికాలో ముగ్గురు ఏపీ వ్యక్తుల కిరాతకం.. విద్యార్థిని 7 నెలలుగా హింసిస్తూ రాక్షసానందం!

Ram Narayana

 ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థినికి ఆకతాయిల వేధింపులు

Ram Narayana

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Ram Narayana

Leave a Comment