ఖమ్మం కు యూనివర్సిటీ ఇవ్వండి …సీఎం కు సీఎల్పీ నేత భట్టి విజ్ఞప్తి!
–పోడు భూములు సమస్య పరిష్కరించండి
–మధిర కు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయండి
–అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , ఇళ్లస్థలాలు ఇవ్వాలి
–జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి …
ఖమ్మం యూనివర్సిటీ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు . బుధవారం ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం వచ్చిన కేసీఆర్ ను కలిసి భట్టి సీఎం కు వినపతి పత్రం అందించారు . ఖమ్మంలో జరగనున్న బీఆర్ యస్ సభలో పాల్గొనేందుకు వచ్చిన కేరళ , ఢిల్లీ , పంజాబ్ , సీఎంలు పినారవి విజయన్, కేజ్రీవాల్ , మాన్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ , సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా లకు భట్టిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేశారు . తన వినతి పత్రంలో మధిర కు ప్రభుత్వ ఇంజినీరీంగ్ కళాశాల మంజూరి చేయాలనీ కోరినట్లు తెలిపారు . అదే విధంగా పోడు భూముల సమస్య పరిష్కరించాలని , పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చేయాలనీ కోరినట్లు చెప్పారు . అదే విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.