Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు!

టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు!

  • చాగంటిని సలహాదారుగా నియమించినట్టు వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి
  • గత మూడేళ్లుగా పారాయణాలను నిర్వహిస్తున్నామన్న టీటీడీ ఛైర్మన్
  • ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుళ్లేందుకు చాగంటిని నియమించామని వెల్లడి
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. చాగంటిని సలహాదారుగా నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారావు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారని… వారి కోసం గత మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నిన్న ఎస్వీబీసీ, హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మప్రచారం కార్యక్రమాలను స్థానికి యువత భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
చాగంటి కోటేశ్వరరావు ను టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమించడంపట్ల వివిధ ధార్మిక సంస్థలు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఆధ్వరంలో మరిన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .చాగంటి అంటే ప్రపంచ వ్యాపితంగా తెలియని తెలుగువారు లేరంటే అతిశయెక్తి లేదు . ఆయన చేస్తున్న ప్రవచనాలు అరటి పండు వలసి నోట్లో పెట్టినట్లు ఉంటుంది . ఆయన చెపుతున్న విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి తెలుగువారు కపరచడం విశేషం…

Related posts

బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు

Drukpadam

మంత్రి పదవి రేపు ఉంటుందో, ఊడుతుందో.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

యుద్ధ విమానం కూలిపోతే ఇంట కథ ఉందా?

Drukpadam

Leave a Comment