Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పోస్ట్ చేసిన వందేళ్ల తర్వాత లెటర్ డెలివరీ!

పోస్ట్ చేసిన వందేళ్ల తర్వాత లెటర్ డెలివరీ!

  • లండన్ లో చోటు చేసుకున్న విచిత్రం
  • 1916లో పోస్ట్ చేయగా, 2021లో డెలివరీ
  • సార్టింగ్ సమయంలో తప్పిపోయి ఉంటుందన్న అంచనా

పూర్వం వ్యక్తుల మధ్య సంబంధాలకు లేఖలు ముఖ్య వారధిగా ఉండేవి. అప్పట్లో టెలిఫోన్ సౌకర్యం చాలా ప్రాంతాలకు ఉండేది కాదు. అందుకే ఏ సంప్రదింపులు అయినా లేఖల రూపంలో ఉండేవి. లండన్ లో ఓ లేఖ పోస్ట్ చేసిన 100 ఏళ్ల తర్వాత ఇటీవలే డెలివరీ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి తన ఫ్రెండ్ అయిన కేటీ మార్ష్ కు పోస్ట్ చేశారు.

వందేళ్ల తర్వాత 2021లో ఈ లేఖ లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద లెటర్ బాక్స్ లో తేలింది. రాయల్ మెయిల్ సిబ్బంది వందేళ్ల తర్వాత జాగ్రత్తగా డెలివరీ చేసింది. నిజానికి ఈ లేఖను అందుకోవాల్సిన వ్యక్తి భూమిపై లేరు. సంబంధిత ఫ్లాట్ లో ఉండే గ్లెన్ (27) అనే వ్యక్తి ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. ఏడాది పాటు ఈ లేఖను అలా చూసిన తర్వాత చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు. ఇంత కాలం పాటు ఎందుకు డెలివరీ చేయలేదనే దానికి రాయల్ మెయిల్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సార్టింగ్ ఆఫీసులో ఇది తప్పిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Related posts

ఉత్కంఠ‌కు తెర‌.. గెల్లు శ్రీనివాస్ టీఆర్ యస్ అభ్యర్థి ప్రకటించిన సీఎం కేసీఆర్!

Drukpadam

ఏపీ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్నీ

Drukpadam

డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు.. నగరాన్ని మురికికూపంగా మార్చారు: కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

Ram Narayana

Leave a Comment