తెలుగు రాష్ట్రాలు

 వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం!

  • విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలోని కాశీంపేట వద్ద ఘటన
  • ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తోన్న ఎమ్మెల్యే
  • కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీ.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు

గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద ఈ సంఘటన జరిగింది. వల్లభనేని వంశీ శనివారం ఉదయం కాన్వాయ్‌లో విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలోని కాశీంపేట వద్ద ఈ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Related posts

ఆయన బండి సంజయ్ కాదు… తొండి సంజయ్: సీపీఐ రామకృష్ణ!

Ram Narayana

వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం…

Ram Narayana

హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములతో భారీ వర్షం

Ram Narayana