Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

అసదుద్దీన్ నోటా బీజేపీ మాటలు …

ఇండియా కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కానే కాదు: ఒవైసీ

  • కాంగ్రెస్, బీజేపీ సుదీర్ఘకాలం దేశాన్ని పాలించాయన్న ఒవైసీ
  • కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేని మూడో ప్రత్యామ్నాయం అవసరమని వెల్లడి
  • ఇండియా కూటమి ఓ పెద్దమనుషుల క్లబ్ అని వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియా కూటమిపై స్పందించారు. ఇండియా కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కానే కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించాయని, దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిని ఓ పెద్ద మనుషుల క్లబ్ అని ఒవైసీ అభివర్ణించారు. 

“ఇండియా కూటమి ఓ ప్రత్యామ్నాయం అని నేను అనుకోవడంలేదు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలిస్తే, బీజేపీ ఓ 18 ఏళ్లు పాలించింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల ప్రమేయం లేని మూడో ప్రత్యామ్నాయం దేశానికి కావాలి. మన యుద్ధం మనమే చేయాలి” అని ఒవైసీ పిలుపునిచ్చారు.

Related posts

గుజరాత్ వాళ్లే మనుషులా… తెలంగాణ వాళ్లు కాదా?: ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

Ram Narayana

ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ భార్య సునీత బెస్ట్ పర్సన్: ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్

Ram Narayana

ఎన్నికల్లో ఓడినా సరే వరించిన కేంద్ర మంత్రి పదవి…

Ram Narayana

Leave a Comment