Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు పై విజయసాయి సెటైర్లు …

ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాలను బతకనిస్తారా? విజయసాయిరెడ్డి

  • రాష్ట్రపతి, ప్రధాని పదవులను ఎవరికెళ్లాలో నిర్ణయించిన వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్
  • ఢిల్లీలో చక్రాలు తిప్పిన వ్యక్తి అంటూ విజయసాయిరెడ్డి చురకలు
  •  న్యాయం, సత్యం, ధర్మాన్ని బతకనిస్తారా బాబూ అంటూ ఎద్దేవా 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని బతకనిస్తారా? అని తనదైన శైలిలో చురకలు అంటించారు.  

‘రాష్ట్రపతి, ప్రధాని పదవులు ఎవరికెళ్ళాలో నిర్ణయించిన వ్యక్తి…. ఢిల్లీలో చక్రాలు తిప్పిన వ్యక్తి…. స్వయంప్రకటిత సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్త, ఆద్యుడు… సంపద సృష్టికర్తగా చెప్పుకునే మీరు…. స్కాంలు చేసి బెయిల్ పైన బయట ఉంటే సాక్ష్యాలు చెరిపేయరా? న్యాయం, సత్యం, ధర్మాన్ని బతకనిస్తారా బాబూ!’ అంటూ ట్వీట్ చేశారు.

Related posts

ఉపముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ …!

Ram Narayana

జగన్ చెప్పిన వినని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి…పార్టీకి గుడ్ బై చెప్పేందుకే మొగ్గు …!

Ram Narayana

ఆర్టీసీ బస్సెక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు… ఫొటోలు ఇవిగో!

Ram Narayana

Leave a Comment