Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. స్పందించిన ఇస్రో చీఫ్

  • ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్
  • రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య
  • ప్రస్తుతం ఎక్స్‌పోశాట్‌పై దృష్టి పెట్టినట్టు వెల్లడి

చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రముఖ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చీఫ్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. 

ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్‌ శాటిలైట్‌పై (ఎక్స్‌పోశాట్) ప్రస్తుతం దృష్టి సారించినట్టు ఇస్రో చీఫ్ తెలిపారు. ఎక్స్‌పోశాట్‌తో పాటూ ఇన్‌శాట్-3డీని కూడా నవంబర్-డిసెంబర్ నెలల్లో ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.

Related posts

ఎంఎస్ ధోనీపై పరువునష్టం కేసు నమోదు.. రేపు విచారణ

Ram Narayana

హర్యానాలో టూరిస్టు బస్సులో మంటలు.. 9 మంది సజీవదహనం..

Ram Narayana

గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం విజయవంతం

Ram Narayana

Leave a Comment