Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

స్కిల్ కేసులో నారా లోకేశ్ కు అక్టోబర్ 4 వరకు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా!

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేశ్ కు స్వల్ప ఊరట
  • అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు
  • తదుపరి విచారణ 5వ తేదీకి వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related posts

తల్లిదండ్రులను పట్టించుకోని తనయుడికి ఝలక్.. ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Ram Narayana

ఈడీ తన అరెస్ట్ కు ఆధారాలు చూపించలేదని కోర్టులో కేజ్రీవాల్ వాదన…

Ram Narayana

తాజ్‌ మహల్‌పై యూపీ కోర్టులో మ‌రో పిటిషన్‌

Ram Narayana

Leave a Comment