క్రైమ్ వార్తలుతెలుగు రాష్ట్రాలు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లో కేసు

మల్లు రవి ఫిర్యాదు… ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లో కేసు

  • సోనియాపై అవాస్తవాలు మాట్లాడారంటూ ఫిర్యాదు
  • నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలన్న మల్లు రవి
  • బేగం బజార్ పీఎస్ లో కేసు నమోదు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాదులో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. 

ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్ కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని వెల్లడించారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు.

ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Related posts

న్యాక్ రేటింగ్ కోసం లంచాలు.. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ, న్యాక్ అధికారుల అరెస్ట్!

Ram Narayana

పోలవరం – బనకచర్ల డీపీఆర్‌పై కీలక నిర్ణయం.. టెండర్లను ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్…

Ram Narayana

ఏసీబీకి పట్టు బడ్డ మణుగూరు సీఐ సతీష్ కుమార్

Ram Narayana